కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఇవాళ మ.12 గంటలకు పులివెందుల నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కడప జిల్లా పర్యటనలో పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొననున్నారు జగన్.

అనంతరం పులువెందుల నివాసంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు. రేపు గుంత బజార్ లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్.వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రారంభం అనంతరం హెలికాప్టర్ లో బెంగళూరుకు పయనం అవుతారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.