నలుగురు ఏపీ యాత్రికులు గల్లంతు – ఏపీ సర్కార్ ప్రకటన

-

అమర్‌నాథ్ యాత్ర : ఇప్పటివరకు అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం…..జల విలయంలో మొత్తం 15 మంది యాత్రికులు మృతి చెందారని… 37 మంది ఆచూకి గల్లంతు అయినట్లు ఏపి ప్రభుత్వ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ ప్రకటించారు. ఆచూకి గల్లంతైన యాత్రికుల సంఖ్య ఈ రోజు సాయంత్రం వరకు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆచూకీ గల్లంతైన వారిలో 16 మంది తెలుగు యాత్రికులు ఉన్నారని.. వీరిలో ఇప్పటివరకు 12 మంది క్షేమంగా ఉన్నారని… కేవలం నలుగురు తెలుగు యాత్రికులు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజమండ్రికి చెందిన గునిశెట్టి సుధ, కొత్త పార్వతి ఆచూకి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

మరో ఇద్దరి పేర్లు తెలియాల్సి ఉంది. వీరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఏపి ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్. శ్రీనగర్ నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏపి ఏపి ఐఏఎస్ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్…ఢిల్లీ రావాలనుకునే తెలుగు యాత్రికులు, బంధువులు ఏపి భవన్ ఏర్పాటు చేసిన “హెల్ప్ లైన్” నెంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version