BREAKING : నంద్యాలలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

-

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో జరిగింది. గురువారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యా భర్తలు గురు శేఖర్‌ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న ఉంది. ఆమె పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్థులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news