అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: చంద్రబాబు

-

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ప్రకటన చేశారు టిడిపి చీఫ్ చంద్రబాబు. అధికారంలోకి రాగానే ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ. 1,500 ఇస్తామని టిడిపి చీఫ్ చంద్రబాబు ట్వీట్ చేశారు.

తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15,000 ప్రోత్సాహకం, ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొన్నారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని చంద్రబాబు చెప్పారు.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. శాసనసభ సమావేశాలు వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. వినాయక చవితి పండుగకి అటు ఇటుగా సమావేశాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో జరపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళుతుండడంతో అప్పుడు సాధ్యం కాదని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news