వైసీపీ పార్టీని రద్దు చేయాల్సిందే – గంటా శ్రీనివాస్‌

-

వైసీపీ పార్టీని రద్దు చేయాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాస్‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రద్దు చెయ్యాలి….ఆ దిశగా ఆలోచన చేయాల్సి న అవసరం ఉందని తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా ఉన్నందుకు బ్యాన్ పెట్టాలని… అసూయ, ఈర్ష్య ద్వేషాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆగ్రహించారు. అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. ఓడించారని అక్కసుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు గంటా శ్రీనివాస్‌.

పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించుకున్న నిధులు వరద సహాయం ఇస్తే…..లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ ఇచ్చింది ఎం త….? అంటూ ఆగ్రహించారు. మార్పు రాకపోతే జగన్ చరిత్ర హీనుడు అవుతాడని… వైఎస్సార్ సీపీ మునిగిపోయిన నావ అన్నారు. కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని… వైసీపీ కి ఈ పరిస్థితి రావడానికి కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డే అని వెల్లడించారు గంటా శ్రీనివాస్‌.

Read more RELATED
Recommended to you

Latest news