ఏపీలో BJP ఒక్క సీటు గెలిచే సత్తా లేదు – గంటా

-

బీజేపీ పార్టీపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అగత్యం టీడీపీకి లేదు…BJPకి ఒక్క సీటు గెలిచే సత్తా లేదని చురకలు అంటించారు. ఆ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంతో జీవీఎల్ నరసింహారావు చెప్పాలని ఎద్దే చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. 355రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు.

ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి లోపాయికారీ పనులు చక్కబెట్టుకుంటున్నారు…యువగళం పాదయాత్రపై వైసీపీ చేసిన దుష్ప్రచారంను ప్రజలు తిప్పికొట్టారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది….సీతకొండ వ్యూపాయింట్ పేరు మార్చడం ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బ తీయడమేనన్నారు. వ్యూపాయింట్ కు జాతీయ నాయకుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version