నా భార్య… టీడిపి ,జనసేన ట్రోలింగ్ తట్టుకోలేక…ఆత్మ హత్య చేసుకుంది – గీతాంజలి భర్త

-

నా భార్య ట్రోలింగ్ తట్టుకోలేక…ఆత్మ హత్య చేసుకుందని ఆరోపాలు చేశారు గీతాంజలి భర్త. ఏపీలో గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 7వ తేదీన గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న ఇల్లు తనకు వచ్చిందని… అమ్మ ఒడి పొందుతున్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది గీతాంజలి. అయితే ఇల్లు వచ్చిన ఆనందంలో.. ఫుల్ జోష్ లో మాట్లాడింది గీతాంజలి.

Geethanjali Suicide Case

అయితే ఇదే ఆమె కొంప ముంచింది. ఈ వీడియోను టిడిపి పార్టీ కార్యకర్తలు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ను చాలా చీప్ గా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో రైలు కిందపడి గీతాంజలి మరణించింది. ఈ తరుణంలో వైసిపి పార్టీ గీతాంజలి కుటుంబానికి అండగా నిలిచింది. అయితే ఈ అంశం పై గీతాంజలి భర్త స్పందించారు. మా ఆవిడ( గీతాంజలి) గురించి ట్రోల్స్ తో నా ఫోన్ కే చాలా మెసేజ్ లు వచ్చాయన్నారు. టీడిపి ,జనసేన పార్టీ సోషల్ మీడియా మాఫియా ట్రోలింగ్ కే మా గీతాంజలి బలైపోయిందని గీతాంజలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version