ప్రజలకు చేసిన మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి – మంత్రి పెద్దిరెడ్డి

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతుందని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొత్తుల అవసరం విపక్ష నేతలకే ఉందని.. వైసీపీకి లేదని అన్నారు. రాజకీయంగా శక్తిహీనుడైన చంద్రబాబుకు పొత్తులు అవసరమని అన్నారు.

2024 ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేయవచ్చని జోష్యం చెప్పారు. సీఎం జగన్ కి జనం జేజేలు కొడుతున్నారని.. పార్టీకి ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు తాము అందిస్తున్న మంచిని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతామన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news