ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న మూడు పథకాలు ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15న స్వాతంత్రోత్సవం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్న క్యాంటిన్లు, ఆస్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పలు శాఖల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్న విధానం పై అధ్యయనం చేయాలని సూచించారు. నెలకు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు సూచించారు. అలాగే అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాల అమలుకు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. తల్లికి వందనం పథకం కోసం ఇది వరకే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను విడుతల వారిగా తిరిగి ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news