అంత సిగ్గుపడటం ఎందుకు ఆర్.ఆర్.ఆర్… ఇదిగో సొల్యూషన్!

-

చీపు లిక్కర్లు తాగను, ఏపీలో దొరికే మందు తాగను, షాంపైన్ తాగుతాను.. అది పెద్ద పెద్దోళ్లంతా తాగుతారు.. అది పెద్ద తప్పేమీ కాదు.. పైగా అది పెద్దరికం అన్న రేంజ్ లో తాగుడు గురించి మాట్లాడిన జగన్ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తనదైన “రచ్చ”బండ కార్యకరమంలో పాల్గొన్నారు!! పసుపు మీడియా ప్రత్యక్ష ప్రసారాల సౌజన్యంతో జగన్ పై విరుచుకుపడ్డారు! ఈ సమయంలో ఆయనకు ఒక సమస్య వచ్చింది.. ఫలితంగా ఆయన అభిమానులు ఒక సూచన చేస్తున్నారు!

అవును… నాటి కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరగగా, నేటి కౌరవసభలో న్యాయదేవతకు ఆ అవమానం జరిగిందని చెప్పుకొస్తున్నారు రఘురామ కృష్ణం రాజు! బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారనే కారణంతో సీబీఐ ఎంక్వైరీ కి బ్యాంకులు డిమాండ్ చేసిన తరుణంలో… ఈయన న్యాయదేవతకు ఏదో అవమానం జరుగుతుందని స్పందించడాన్ని అపహాస్యం చేస్తున్న నెటిజన్ల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇలాంటి సభలో తాను కూడా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని తెగ బాదపడుతున్నారు ఆర్.ఆర్.ఆర్.! దీంతో ఆయనకు ఒక సూచన చేస్తున్నారు ఆయన అభిమానులు!

ఇలాంటి సభలో ఉండటం ఎందుకు సర్.. ఈ 23 మంది ఎంపీల్లో మీరు ఉండకండి.. ఈ 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో మీరు ఎంపీగా ఉండటం ఎందుకు సర్.. అమరావతిని రాష్ట్రమంతా కోరుకుంటున్న కోరికను అర్ధం చేసుకోని అధికారంలో ఉన్న పార్టీలో మీరు ఉండటం ఎందుకు సర్.. దయచేసి అలాంటి కౌరవుల తరుపున తమరు ఉండకండి.. చంద్రబాబు – పవన్ కల్యాన్ – మొదలైన పాండవుల తరుపున తమరు ఉండండి అని ఒక సొల్యూషన్ చెబుతున్నారు! మరి ఈ సొల్యూషన్ ని, అభిమానుల కోరికను ఆర్.ఆర్.ఆర్. అర్ధం చేసుకుంటారా లేక ఇలానే జగన్ పార్టీలో కొనసాగుతారా అనేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news