భారత్ లో మళ్ళీ భారీగా కేసుల నమోదు

-

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షల 39 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 730 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 71,760గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7239390 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,26,877 ఉన్నాయి.

ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6301928కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 110586కి చేరింది. ఇక దేశంలో 86.36 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.53 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news