అస్తవ్యస్తంగా హైదరాబాద్ : రంగంలోకి దిగిన కేటీఆర్

-

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉదయమే ఆయన జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తోపాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ కూడా మంత్రి నిర్వహించారు.

జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా అందుబాటులో ఉండాలని, హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ లకు వరద ప్రభావిత ప్రజల్ని తరలించాలని, వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలని ఆయన ఆదేశించారు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. ఓపెన్ నాలల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news