పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్

-

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ కళ్యాణ్‌ సిద్ధం అయ్యారని..వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, మంత్రి అమర్నాథ్ కామెంట్స్ పై జనసేన కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. ఇక తాజాగా మంత్రి అమర్నాథ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివన్నారు. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకని హెచ్చరించారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నానని ..హరి రామజోగయ్య కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news