గుడ్లవల్లేరు ఘటన.. దోషులు ఎంతటి వారైనా వదిలేదే లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

-

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్థరాత్రి నుంచి ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్ బాత్ రూమ్  లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలను రికార్డు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది.  ఇప్పటికే ఈ ఘటన పై కలెక్టర్, ఎస్పీ విచారణ చేపట్టారు. అనుమానితుడి నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.  

తాజాగా ఈ ఘటన పై మంత్రి కొల్లు రవీంద్ర గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన పై ఆరా తీశారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇక ఈ ఘటన పై విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news