బాలకృష్ణ పై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఏంటంటే ?

-

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై హిజ్రాలు కేసు పెట్టారు. హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే బాలకృష్ణపై ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. కానీ హిజ్రాలు కేసు పెట్టడం ఇదేే తొలిసారి. అయితే వారు కేసు పెట్టడానికి గల కారణం ఏంటంటే.? బాలకృష్ణ హిందూపురంలో ఉండడం లేదని, హిందూపురంలోని సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా టర్కీలో ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చగా సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫైర్ ఐన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య పై హిజ్రాలు ఫిర్యాదు చేయడంతో ఎవరో కావాలనే చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో లేరని.. కానీ ఫిర్యాదు మాత్రం బాలయ్య మీదనే ఎలా ఇస్తారు అంటూ నందమూరి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news