బెజవాడ కేంద్రంగా వైల్డ్ లైఫ్ యానిమల్ స్మగ్లింగ్..లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ప్రచారం చేసి !

-

బెజవాడ కేంద్రంగా వైల్డ్ లైఫ్ యానిమల్ స్మగ్లింగ్ జరుగుతోంది. పెద్ద మొత్తంలో వైల్డ్ లైఫ్ యానిమల్ స్మగ్లింగ్ పట్టుబడటం దేశంలో మొదటిసారని చెబుతున్నారు అధికారులు. నెలరోజులు పరిశీలన జరిపి నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తున్నాడట నిందితుడు శ్రీనివాస్. దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్, ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసిన నిందితుడు శ్రీనివాస్… లక్ష్మీ కటాక్షం, పెళ్ళి కావటం, పిల్లలు పుట్టడం, భార్యభర్తలు కలిసి ఉండాలంటే ఇవి ఇంట్లో ఉంటే మంచిదంటూ యూ ట్యూబ్ ద్వారా విస్తృత ప్రచారం చేశాడట.

Illegal and ignominious world of wildlife trafficking

యూ ట్యూబ్ లో వీటి అమ్మకాలు చూసి స్వయంగా రంగంలోకి దిగిన వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్… జింక చర్మాలు, అడవి నక్క తోకలు, ముళ్ళ పంది ముళ్లు, పాము కుసుములు వంటి కోటి విలువైన వాటిని సీజ్ చేసింది. తెలంగాణలోని వరంగల్ కు చెందిన శ్రీనివాస్ వెనుక స్మగ్లింగ్ ముఠా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. బెజవాడలో అక్షయ నిధి మార్ట్ పేరుతో ఏడాదిగా అమ్మకాలు జరిపిస్తున్నాడట. మేడారం జాతరలో ఇవి కొన్నట్టు అధికారులకు చెప్పాడట శ్రీనివాస్.
సముద్ర గర్భంలో ఎకో సిస్టం సరిచేసే సీ ఫ్యాన్స్ ను బయటకు తేవటమే అత్యంత క్లిష్టమని చెబుతున్నారు అధికారులు. అంతరించిపోతున్న వైల్డ్ లైఫ్ ప్రాణుల జాబితాలో సీ ఫ్యాన్స్ ఉన్నాయి. చూడటానికి చెట్టు మాదిరిగా ఉండే సీ ఫ్యాన్స్ ప్రాణముండి సముద్రంలో 20 మీటర్ల లోతులో జీవిస్తాయని చెబుతున్నారు అధికారులు. ఇక శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడంతో.. రెండు వారాలు రిమాండ్ విధించింది న్యాయ స్థానం.

Read more RELATED
Recommended to you

Latest news