పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం !

-

Pithapuram: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం జరిగింది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరు పై కార్యకర్తలు ఫైర్ అయ్యారు. జనసేన వార్డు కమీటీ సభ్యలతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాదు కు పవన్ పయనం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పడిగాపులు కాసారు కార్యకర్తలు.

In Pithapuram, the Janasena workers are deeply humiliated

హోటల్ లోపలికి రానివ్వకుండా గేటు వేశారు పవన్ బౌన్సర్లు. టిడిపి ఇన్ఛార్జ్ వర్మ ను కూడా అడ్డుకోవడంతో గేట్లు గెంటుకుని లోపలికి వెళ్లారు టిడిపి నాయకులు. పార్టీ కోసం సేవ చేసిన తమను వెధవల్ని చేశారని తన ఆవేదనను వాట్సప్ గ్రూపులో షేర్ చేశారు జనసేన కార్యకర్తలు.

పిఠాపురం కు ఎవరేవరో వస్తున్నారు..వారిని భుజం మీద పెట్టుకుని మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహీ కోసం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్ ను తిట్టుపోసుకుంటున్నారు జనసేన కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news