లింగమనేని పొలం మధ్యలోంచి ఇన్నర్ రింగ్ రోడ్డు.. పేర్ని నాని ఫైర్

-

అసెంబ్లీ సమావేవాలు చివరి రోజు సందర్భంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ పై సభలో చర్చ కొనసాగింది. ఈ తరుణంలో టీడీపీ నేత లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రోడ్డు వచ్చేవిధంగా ప్లాన్ మార్చారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పేర్నినాని. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి అన్నారు.

దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. కేబినెేట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రోడ్డు వచ్చేవిధంగా ప్లాన్ మార్చారు. హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ మార్చారు. ఏ-14గా ఉన్న లోకేష్ ఐఆర్ఆర్ తో నాకేం సంబంధం అన్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ సంస్థకు లోకేష్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే భూములు కొనాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news