పుంగనూరు నిషేధిత ప్రాంతమా..? – సీపీఐ రామకృష్ణ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు, మరో ఇద్దరు మాజీ మంత్రులపై అక్రమంగా పెట్టిన హత్యాయత్నం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి సర్కారుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. పుంగనూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు సహా టిడిపి నేతలపై కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పుంగనూరు నిషేధిత ప్రాంతమా..? అని మండిపడ్డారు. పుంగనూరులో పోలీసులను మోహరించి, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పంపిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news