ఏపీ మంత్రులకు షాక్‌.. ఎస్కార్ట్ వాహనాలు రద్దు !

-

ఏపీ మంత్రులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఇక ఎస్కార్ట్‌ వాహనాలు రద్దు కానున్నాయి. తాజాగా వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని ప్రతిపాదించారు నారా లోకేష్.

It was decided to use ministerial escort vehicles to help the flood victims get government assistance

ఇక నారా లోకేష్ ప్రతిపాదనకు అంగీకరించారు ఏపీ మంత్రులు. ఈ నేపథ్యంలోనే వరద నేపథ్యంలో ఎస్కార్ట్ వాహనాలు సహాయ కార్య క్రమాలకు వినియోగించాలని నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చివరి వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందేందుకు వీలుగా మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువులు, భోజనం, త్రాగునీరు అందించే వాహనాలకు ఎస్కార్ట్ గా వెళ్లనున్నాయి మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు.

Read more RELATED
Recommended to you

Latest news