50 ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఏమైంది? మొత్తం పెన్షన్లనే తగ్గించేశారని ఆరోపణలు చేశారు జగన్ మోహన్ రెడ్డి. 2024లో 66 లక్షలకుపైగా పెన్షనర్లు ఉన్నారు… 5 లక్షల పెన్షన్లకు కోత పెట్టారన్నారు మండిపడ్డారు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిలో 5 లక్షల మందిని తీసేశారని పేర్కొన్నారు వైఎస్ జగన్.

ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశాడు… ఆరోగ్యశ్రీ పథకం రూ.3600 కోట్లు పెండింగ్ లో పెట్టాడని నిప్పులు చెరిగారు. ఆరోగ్య ఆసరా కింద రూ.400 కోట్లు ఎగ్గొట్టారని బాంబు పేల్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తల్లికి వందనం పేరుతో తల్లులందరినీ మోసం చేశాడు అని చంద్రబాబు నాయుడు పై ఆగ్రహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది కి రూ.15వేల చొప్పున ఇస్తా అన్నాడన్నారు. రూ.13,170 కోట్లు ఇవ్వాల్సింది పోయి రూ.8700 కోట్లు ఇస్తామంటున్నారు… దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టాడని నిప్పులు చెరిగారు.