జోగి రమేష్‌ కు గెలవని సీటు ఇచ్చారని ఫెక్సీల కలకలం !

-

ఏపీ మంత్రి జోగి రమేష్‌ కు గెలవని సీటు ఇచ్చారని ఫెక్సీలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ జిల్లా పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ ఆగడం లేదు. జోగి రమేష్‌పై పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమ లూరు సీట్ ఇచ్చారని భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ తరుణంలోనే నేడు మంత్రి జోగి రమేష్ పెనమలూరు తొలి విజిట్ ఉండనుంది.

jagan confirmed the seat for minister jogi ramesh

తన పుట్టిన రోజైన నేడు కొత్త నియోజక వర్గం పెనమ లూరు వెళ్తున్నారు మంత్రి జోగి రమేష్‌. జోగి నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. జోగి ఇంఛార్జి అవగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేశారు. అసమ్మతి రాగాల నడుమ జోగి తొలి పర్యటనపై హైటెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news