తెలంగాణ ప్రజలకు సంక్రాంతి విషెస్ తెలిపిన KTR

-

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి విషెస్ తెలిపారు KTR. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ హడా విడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభా కాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు కేటీఆర్‌. మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..

KTR gave Sankranti Wishes to the people of Telangana

ఈ సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలని, పతంగుల మాదిరిగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. ఇక అటు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఊరువాడ ముగ్గులు పోటీలు ఆటల పోటీలతో సందడి చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కళాకారుల సందడి తగ్గింది. ఊరంతా తిరిగి సందడి చేసే కళాకారుల సంఖ్య నాటికి తగ్గిపోతుంది. పాత తరం వారు తప్ప కొత్త కళాకారులు ఎవరు ఈ రంగం వైపు రాకపోవడంతో లోటు కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news