తెలుగు ప్రజలకి ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు

-

తెలుగు ప్రజలకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలుపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని ఆయన అన్నారు.

జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సివిజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెల పెండింగ్ జీతాలతో పాటు, పెన్షన్లు, 2 డీఏలు నవంబర్‌లో చెల్లించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news