వీఆర్వోలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!

-

జగన్ సర్కార్ ఏపీలో వీఆర్వోలకు శుభవార్త చెప్పింది. గ్రేడ్‌–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులలకు అండగా వుంది ప్రభుత్వం అని చెప్పింది. అయితే గ్రేడ్‌–1, 2 వీఆర్‌వోలు సర్వీస్ లో వుంది చనిపోతే వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.

కారుణ్య నియామకానికి అవాకాశాన్ని ఇచ్చింది. సర్వీస్‌ నిబంధనలు–2008 లో మార్పులు చేసింది. ఈ విషయంపై మార్పులు చేసినట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేసారు.

దీని వలన కలిగే ఉపయోగం ఏమిటంటే గ్రేడ్‌–1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ ప్యాస్ అయిన భాగస్వామి లేదా పిల్లలకి కారుణ్య నియామకం కింద జూనియర్‌ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన పోస్ట్ ని ఇస్తారు. వీఆర్‌వోలు ఎప్పటి నుండో ఈ విషయంపై ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఏపీలో వీఆర్వోలకు శుభవార్త చెప్పింది. గ్రేడ్‌–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులలకు అండగా నిలిచింది. సీఎం కి ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదములు చెప్పారు. అలానే వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కూడా ధన్యవాదములు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news