ఇంగ్లీష్ మీడియంపై జగన్ సంచలన నిర్ణయం..!

-

ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వనుంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక క్యాటగిరీ అవార్డు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది జగన్‌ సర్కార్‌. ఇంగ్లీష్ మీడియం బోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు అవార్డు ఇవ్వనుంది సర్కార్‌.

ఉపాధ్యాయుల ఎంపికకు CENTA అనే ప్రైవేటు సంస్థతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. CENTA- సెంటర్ ఫర్ టీచర్ అక్రిడేషన్- ప్రపంచ వ్యాప్త ఉపాధ్యాయుల వేదిక జరుగనుంది. సెప్టెంబర్ 1 నాటికి సెంటాతో కలిసి ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్న పాఠశాల విద్యాశాఖ.. ఆ తర్వాత ఉపాధ్యాయులకు అవార్డు ఇవ్వనుంది సర్కార్‌. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news