వైనాట్ 175 అంటున్న జగనుకు వచ్చే ఎన్నికల్లో మిగిలేది 17 స్థానాలే – జలీల్ ఖాన్

-

వైనాట్ 175 అంటున్న జగనుకు వచ్చే ఎన్నికల్లో మిగిలేది 17 స్థానాలే అంటూ టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు మీనార్ కు వైసీపీ బెలూన్లు కట్టి, ముస్లిం మతాన్ని అగౌరపరిచినందుకు ముస్లింలకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారం ఉందని అహంకారంతో ఇస్లాంను అవమానిస్తారా? అని నిప్పులు చెరిగారు.

సభ్యత, సంస్కారం, సిగ్గు, లజ్జ ఉంటే ఇలాంటి పనులు చేస్తారా? వైసీపీ ప్రభుత్వ తీరుపై ముస్లిం సమాజం ఆగ్రహావేశాలతో రగిలిపోతోందని మండిపడ్డారు. నంబూరు వెళ్లిన సీఎం జగన్ మర్యాదగా కూడా హజ్ యాత్రికుల్ని పలకరించలేదని… సీఎం జగన్ కేవలం 2 నిమిషాలు మాత్రమే అక్కడుండి మొక్కుబడిగా వచ్చాననిపించుకున్నారని వెల్లడించారు. హాజీలకు కూడా దూరం నుంచే చెయ్యి ఊపి వెళ్లిపోయారని… హాజ్ కమిటీ ఆహ్వానంతో అక్కడికెళ్లిన చంద్రబాబు, గౌరవ మర్యాదలతో వ్యవహరించి, ముస్లిం మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారని పేర్కొన్నారు. హాజ్ యాత్రికుల్ని ప్రేమతో పలకరించి, వారికి స్వీట్ ప్యాకెట్లు పంచారని.. చంద్రబాబు కడపలో హజ్ హౌస్ నిర్మించారని గుర్తు చేశారు టీడీపీ నేత జలీల్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news