జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్వల్ప అస్వస్థత..!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.   ఈరోజు ‘యువగళం- నవశకం’ సభలో పాల్గొననున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే, నిన్న రాత్రి నుంచి ఆయన జ్వరం కారణంగా స్వల్ప అస్వస్థతతో ఉండడంతో సభకు కొంచెం ఆలస్యంగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొందరూ అస్వస్థత కారణంగా పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాకపోవచ్చనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తరచూ అస్వస్థతకు గురవుతుండటం గమనార్హం. ఓవైపు సినిమా షూటింగులు, రాజకీయ సభలు, సమావేశాలతో బిజీగా ఉండటంతో పవన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇటీవలే పవన్  అస్వస్థతకు గురి కావడంతో ఓ సభ, సినిమా షూటింగ్  కూడా వాయిదా పడినట్టు సమాచారం. అదేవిధంగా గతంలో  పవన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో.. నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వెళ్లలేదని కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఇవాళ జరిగే యువగళం-నవశకం సభకు పవన్ హాజరు అవుతున్నారు. కానీ కాస్త ఆలస్యంగా వెళ్లనున్నట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news