నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు… వారందరికీ ప్రమాద, జీవిత బీమా !

-

జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతోంది. జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభమై ఈనెల 28వ తారీకు వరకు… నిర్వహించనున్నారు. కొత్త సభ్యత్వ నమోదు తో పాటు రెన్యూవల్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీ సభ్యత్వం పొందే ప్రతి కార్యకర్తకు… ప్రమాద బీమా చెల్లించనుంది.

ప్రమాద బీమా తో పాటు… జీవిత బీమా కూడా చెల్లిస్తుంది జనసేన పార్టీ. ఇక ఈ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో… ఇవాళ ఉదయం 10 సమయంలో నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన పార్టీ గెలిచిన సంగతే తెలిసింది. అలాగే జనసేన రెండు ఎంపీలను కూడా గెలుచుకుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఈ తరుణంలోనే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news