BREAKING : ముద్రగడని కలిసిన జ్యోతుల నెహ్రూ

-

BREAKING : ముద్రగడ పద్మనాభంను కలిశారు జ్యోతుల నెహ్రూ. కాకినాడలో ముద్రగడతో జ్యోతుల నెహ్రూ సమావేశం కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముద్రగడ దృష్టికి తీసుకుని వెళ్లారు నెహ్రూ. కాపు నేతగానే తాను వచ్చానని క్లారిటీ ఇచ్చారు జ్యోతుల నెహ్రూ.

mudragada padmanabham

ముందు నా నియోజకవర్గంలో కాపులను కలపాలి కాబట్టి ఇక్కడికి వచ్చానని తెలిపారు నెహ్రూ. ఇప్పటి వరకు ఐక్యత లేకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. టిడిపి – జనసేన కూటమిలో కాపులకు అధిక ప్రాధాన్యత ఉంటుందని పద్మనాభం దృష్టికి తీసుకెళ్లారు జ్యోతుల నెహ్రు. జాతికి ప్రయోజనాలు ఉందంటే కలిసి ప్రయాణం చేద్దామని తెలిపారు ముద్రగడ. దీంతో టిడిపి – జనసేన కూటమికి ముద్రగడ జై కొడతారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news