సోమిరెడ్డిని చంద్రబాబు కట్టడి చేయాలి : కాకాణి

-

ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ.. వాటి యాజమాన్యాలపై టిడిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడికి పాల్పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రౌడీ లాగా సోమిరెడ్డి ప్రవర్తించారు. ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం ఎంతవరకూ సబబు. ఇలా వ్యవహరిస్తే రేపటినుంచి వారు ఎలా విధులు నిర్వహిస్తారు. ఇలా దురుసుగా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు.

అధికారం లోకి వచ్చిన నెల రోజుల్లోనే కంటైనర్ టెర్మినల్ ను తీసుకువస్తానని సోమిరెడ్డి చెప్పారు. కంటైనర్ టెర్మినల్ ను తీసుకు వస్తామని చెప్పేవారు ఈ విధంగా వ్యవహరిస్తారా.. పరిశ్రమల ప్రతినిధులపై సోమిరెడ్డి నోరు పారేసుకుంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు.. సోమిరెడ్డిని కట్టడి చేయాలి. ఇక టిడిపి నేతలు ఇసుకను దోచుకుంటున్నారని మేము చెబుతున్నాం. ఉచిత ఇసుకను అమలు చేయాలని కోరుతూ మేము ఆందోళన చేశాం అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version