బాలయ్యకు బుర్రలేదు.. లోకేష్‌ ముద్దపప్పు గాడు – ఏపీ మంత్రి

-

 

బాలయ్యకు బుర్రలేదు.. లోకేష్‌ ముద్దపప్పు గాడు అంటూ చురకలు అంటించారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. టీడీపీని యనమల, బాలకృష్ణ కబ్జా చెయ్యాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పార్టీ పగ్గాలు కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారని… లోకేష్ అసమర్థుడు కనుక బాలకృష్ణ, యనమల రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని యనమల, బాలకృష్ణ కబ్జా చెయ్యాలని చూస్తున్నారని.. టీడీపీని కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని చురకలు అంటించారు.

karumuri comments on tdp party over balayya and lokesh
karumuri comments on tdp party over balayya and lokesh

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అధికారంలోకి వస్తాం అంటున్నాడని.. అధికారంలో ఉండగా దోచుకోడం తప్ప లోకేష్ ఇంకేమి చెయ్యలేదని పేర్కొన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రెండెకరాల నుంచి 3 లక్షల కోట్ల ఆస్తులు పోగు చేశారని.. చంద్రబాబు బ్రతుకు అంతా స్కాంల మయం అంటూ ఫైర్ అయ్యారు. 2018లో నారా లోకేష్ గురించి పవన్ చెప్పినవి ప్రజలు ఇంకా మర్చిపోలేదని.. లోకేష్ అవినీతి గురించి పవన్ ఆనాడే చెప్పాడన్నారు. ఆనాడు పవన్ కుటుంబాన్ని బూతులు తిట్టించి నేడు అన్న అంటున్నాడు….పవన్ ప్యాకేజ్ స్టార్ట్ అని మరో సారి రుజువు అయ్యిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news