నేను టీడీపీలో ఉన్నాను.. ఆ పార్టీ నుంచే గెలుస్తా – కేశినేని నాని

-

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. నేను టీడీపీలో ఉన్నానని.. ఆ పార్టీ నుంచే ఎంపీగా మళ్లీ పోటీ చేస్తున్నానని వెల్లడించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల పట్టణంలో “ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్” భూమి పూజ కార్యక్రమానికి హాజరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని…ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ రాజకీయాల్లో చంద్రబాబు చాలా నిజాయితీ గల వ్యక్తి….చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి అనే మచ్చలేని నాయకుడంటూ ప్రశంసలు కురిపించారు. ఐటి నోటీసులు పెద్ద విషయం కాదు దానికి వివరణ ఇస్తారు…ఇవన్నీ తాత్కాలికమే మాత్రమేనన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. నేను టిడిపి లోనే ఉన్నా ,వచ్చే ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా టిడిపి నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో క్రింద స్థాయి నాయకులను ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లకపోవడం దురదృష్టకరం అన్నారు నాని.

Read more RELATED
Recommended to you

Latest news