ఏపీ ప్రజలు మా గుండెల్లో వున్నారు: మల్లికార్జున్ ఖర్గే

-

ఎన్నికలవేళ ఏపీలో కాంగ్రెస్ దూకుడుని పెంచింది షర్మిల పిసిసి చీఫ్ కావడంతో పార్టీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు తాజాగా అనంతపురంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించారు. సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఏపీ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని అన్నారు. అనంతపురం జిల్లా దేశానికి ఇద్దరు రాష్ట్రపతులు ఇచ్చిన ఇచ్చిందని ఖర్గే అన్నారు అనంతపురం జిల్లాకి సత్యసాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారని ఆయన ఆశయాల కోసమే షర్మిల అని తీసుకువచ్చామని అన్నారు తమ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన హామీలు నెరవేరుస్తామని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news