కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

-

కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని  మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అన్నారు.

పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకోస్తామని వెల్లడించారు. కేవలం పరిశ్రమల స్తాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తాం. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు… ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నాం..

Read more RELATED
Recommended to you

Latest news