వచ్చే ఎన్నికల్లో జగన్ ని ఓడించండి: సర్పంచుల సంఘం అధ్యక్షుడు

-

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై వి బి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఆయన విజయ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 12918 గ్రామాల్లో 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు ప్రభుత్వం వండి వైఖరి విడవట్లేదు అన్నారు.

16 న్యాయమైన డిమాండ్ల సాధనకి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు వద్ద నిరసన చేస్తున్నామన్నారు. వైసిపి ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎన్ని పోరాటాలు చూసినా కూడా సర్కారు స్పందించట్లేదని ఇంటింటి ప్రచారం చేసే జగన్ చేసిన అన్యాయం వివరిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news