సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తా – కోడెల శివరాం

-

సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు కోడెల శివరాం. కోడెల కుటుంబం తరఫున పోరాడే హక్కు మాకుంది.. ఏ రోజు అధిష్టానం నుంచి మాకు పిలుపు రాలేదని ఆగ్రహించారు. మా కుటుంబంపై చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు.. మేం ఏ తప్పులు చేయలేదు.. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని కోరారు కోడెల శివరాం.

కోడెల కుటుంబంపై టీడీపీ అధిష్టానం వివక్ష చూపుతోందని ఫైర్‌ అయ్యారు కోడెల శివరామ్. టీడీపీ కోసం పని చేసి ప్రాణాలు వదిలిన కోడెల కుటుంబాన్ని పార్టీ పక్కన పెడుతోందని నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసిన కీలక నేతల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటోందని.. మరి కోడెల కుటుంబం పట్ల ఎందుకు ఇలా వివక్ష అని ఫైర్‌ అయ్యారు. కోడెల భార్యకు, మా అమ్మ కు సరైన గౌరవం లేదని మండిపడ్డారు. చంద్రబాబును కలిసి మా బాధను చెప్పటానికి 5 నిమిషాలు సమయం ఇవ్వటం లేదు… కొందరు కావాలని కోడెల కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news