నెల్లిమర్ల ఈవీఎం గోదాముల తాళాలు మిస్సింగ్.. కలెక్టర్ సీరియస్..!

-

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ఈవీఎం గోదాము తాళాలు మిస్స్ కావడం గమనార్హం. దాదాపు రెండు గంటలుగా అధికారులు తాళాల కోసం తర్జన భర్జన పడుతున్నారు. మాజీ ఎంపీ బెలలాన, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఈవీఎంలపై ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్దమయ్యారు అధికారులు. విచారణలో భాగంగా గోదాం తలుపులు తెరిచేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ వచ్చారు. ఈవీఎం బాక్సుల తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

గజపతి నగరం నియోజకవర్గం ఈవీఎం గోదాం తాళాలు ఆర్డీఓ దగ్గర ఉన్నాయంటూ అధికారులు జాప్యం చేస్తున్న వైనం నెలకొంది. తలుపు పగులగొట్టి చూపిస్తామంటూ ఫిర్యాదు దారులను అధికారులు సముదాయిస్తున్నారు. ఈవీఎంలు ఉన్న గోదాము తాళాల కోసం ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు. గోదాము తాళాలు లేకపోతే సదరు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ హెచ్చరిక జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news