BREAKING : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా లోకేశ్.. సీఐడీ మెమో దాఖలు

-

BREAKING : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో A14గా నారా లోకేష్ ను చేర్చిన సిఐడి… ఇవాళ ఏసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో A1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు మొదలవుతాయి.

కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రం వరకు తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news