లోకేష్ గెలిచేది లేదు.. ఆ బుక్ ఓపెన్ చేసేది లేదు : సజ్జల

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ వ్యాఖ్యలకు వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తాజాగా సజ్జల ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, నారా లోకేష్ గెలిచేది లేదు.. రెడ్ బుక్ ఓపెన్ చేసేది లేదని ఎద్దేవా చేశారు. ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ వెనక వేరేవాళ్ల పాత్ర ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు వద్దని తాము ముందు నుండే అనుకున్నామని స్పష్టం చేశారు. జగన్ మాత్రమ నిలకడైనా రాజకీయాలు చేస్తారన్నారు.

శాండ్, మైన్, వైన్ అంటూ వైసీపీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగానే తన భవిష్యత్ ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు దేనికైనా సిద్దమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడుతోన్న వైసీపీ నేతలు, ప్రభుత్వం అండతో రెచ్చిపోతున్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని.. అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలుమార్లు బహిరంగంగానే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news