కడపలో లవ్ జిహాదీ కేసు..యువతిని కిడ్నాప్ చేసి మరీ !

-

కడపలో లవ్ జిహాదీ కేసు నమోదు అయింది. తమ కుమార్తెను అపహరించి ఫజులుల్లా అనే వ్యక్తి మతమార్పిడి వివాహం చేసుకున్నాడని కడపకు చెందిన రామిరెడ్డి భరత భూషణ్ రెడ్డి వారిధిలో ఫిర్యాదు చేశాడు. అటు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. లవ్ జిహాదీ పేరుతో తన కుమార్తె మోసం చేస్తున్నాడని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాడు భరత భూషణ్ రెడ్డి. బాలికతో పాటు 4.8 లక్షలు నగదు, 26 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంటనే కడప ఎస్పీ కి ఫోన్ చేసి న్యాయం చేయాలని కడప ఎస్పీని ఆదేశించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరు ఒకే క్లాస్ మెంట్స్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు తండ్రి. అయితే… ఈ విషయం తెలియకుండా ఆస్ట్రేలియాలో ఉండే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు ఆ బాలిక తల్లిదండ్రులు. ఈ తరుణంలోనే… ఒక్కపక్క ప్రేమాయణం నడుపుతూ, మరో ప్రక్క ఆస్ట్రేలియా యువకుడితో ప్రేమగా నటించి 60 లక్షలు మోసం చేసిందని ఆస్ట్రేలియా యువకుడు కూడా కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియా నుంచి పెద్దలు నిర్ణయించిన యువకుడు ఇండియాకు రాగానే ప్రేమించిన వాడితో పరారైంది యువతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version