దారుణం : ఇద్దరు పిల్లల్ని చంపి పూడ్చబోయిన కన్న తండ్రి

-

ఉన్న కొద్దీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, క్షణికావేశంలో, క్షణిక సుఖాల కోసం ఎంతవరకూ అయినా తెగించడానికి సిద్దం అవుతున్నారు. అక్రమ సంబంధాల నేపధ్యంలో భార్యలు భర్తలని, భర్తలు భార్యలను చంపేందుకు కూడా సిద్దం అవుతున్నారు. ఒక్కోసారి తమకు అడ్డు అనుకుంటే కడుపున పుట్టిన పిల్లలని కూడా చంపుకోడానికి రెడీ అవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో అలాంటి ఘోరమే చోటు చేసుకుంది.

murder
murder

ఇద్దరు చిన్నారుల దారుణ హత్యకు గురికాగా కన్నతండ్రే హతమార్చడారంటూ గ్రామస్థుల అనుమానం వ్యక్తం చేశారు. ఇనుపరాడ్లతో కొట్టడంతో చిన్నారులు సుదీప్(5) సుధీర్ (5) ల ప్రాణాలు కోల్పోయారు. అయితే చిన్నారులను గుంతలు తీసి పూడ్చివేసే ప్రయత్నంలో తండ్రి రాము స్థానికులకి పట్టుబడ్డాడు. అర్ధరాత్రి ఆ బాబుల తల్లి రాధమ్మ నిద్రలో ఉండగా చిన్నారులను తీసుకెళ్లిన తండ్రి రాము, పక్కనే ఉన్న కామక్క పల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ఇద్దరు చిన్నారులు. గతంలోనూ పలుమార్లు చిన్నారులను ఇదేవిధంగా గా చితకబాదడంతో తండ్రి రామునే వారిద్దరిని చంపాడని భావిస్తున్నారు. అయితే రాము ఇప్పుడు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news