టీడీపీ మునిగిపోయే నావ…ఎవరూ ఎక్కరు – వెల్లంపల్లి శ్రీనివాస్

-

టీడీపీ మునిగిపోయే నావ…ఎవరూ ఎక్కబోరని చురకలు అంటించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేయాలని సవాల్‌ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పొద్దున బీజేపీ, రాత్రి కాంగ్రెస్, అర్థరాత్రుళ్లు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశాలు అంటూ చురకలు అంటించారు.

పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మాదని… చంద్రబాబు దేవాన్ష్ తో ఆడుకోవటం మంచిదని ఎద్దేవా చేశారు.నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా విమర్శించాడు… అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లు వేయించాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పురంధరేశ్వరిని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో రాజకీయం చేస్తున్నాడు… కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అన్నారు. చంద్రబాబును డిబార్ చేయటానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

 

Read more RELATED
Recommended to you

Latest news