పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన దుర్మార్గుడు చంద్రబాబు – మంత్రి జోగి రమేష్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. 2024 ఎన్నికల తరువాత టిడిపి అడ్రస్ గల్లంతేనని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని సీఎం జగన్ నాలుగేళ్లలో చేసి చూపించారన్నారు. 600కు పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని అన్నారు.

jogi ramesh

మేనిఫెస్టోని మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబుది నకిలీ చరిత్ర అని విమర్శించారు. డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో అంటూ టిడిపి మేనిఫెస్టోని చించి చెత్తబుట్టలో పడేశారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పి చేసిన దుర్మార్గుడు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news