చిత్తూరులో అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

-

చిత్తూరులో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అమర వీరుల స్థూపం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించి నివాళులు అర్పించారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమర జవాన్ స్మారక స్థూపం ఏర్పాటు చేసి నివాళులు అర్పించామన్నారు.

దేశంలో ఆజాదిగా అమృత్ లో బాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండి ఆర్మీలో సేవలు చేస్తారని.. చిత్తూరు జిల్లా నుండి అనేక మంది అసువులు బాసినారని అన్నారు. వారి కుటుంభానికి వారు లేని లోటు తీర్చలేనిదన్నారు పెద్దిరెడ్డి. అందుబాటులో ఉన్న మంచి భూమిని చూసి సైనికుల కుటుంబాలకు అందించాలని ఆదేశించామన్నారు. స్థిర నివాసం ఉన్న ప్రాంతాల్లో భూమిని ఇవ్వాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news