ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి టి.జి భరత్ అదిరిపోయే శుభవార్త..!

-

ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి టి.జి భరత్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇవాళ కర్నూలులో 4 కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు మంత్రి టి.జి భరత్. ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సులు నడిపారు మంత్రి టి.జి భరత్.

Minister TG Bharat is excited about free bus travel

అనంతరం మీడియాతో మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ… ఆర్టీసి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే ముందు అన్ని రూట్లలో బస్సులు పెంచుతున్నామని ప్రకటన చేశారు మంత్రి టి.జి భరత్. ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి టి.జి భరత్. బస్టాండులో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి టి.జి భరత్.

Read more RELATED
Recommended to you

Latest news