బీజేపీలో బీఆర్ఎస్ విలీనం…కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన

-

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సుంకేశుల డామ్ కులడం పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ విలీనం పై మా పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవని వివరణ ఇచ్చారు. మీడియా పేపర్ కథనాన్ని చూసానని తెలిపారు. అధ్యక్ష మార్పు పై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

kishan reddy

ఢిల్లీలో తన తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని… పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉంది… జమ్మూకాశ్మీర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని.. అందరూ మొక్కలు నాటాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news