పుంగనూరులో చిన్నారి మృతి… మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

-

పుంగనూరులో చిన్నారి దారుణ హత్యపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులు ను పరామర్శించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ…. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు పై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ఇటీవల కర్నూలు లో ఒక అమ్మాయి మిస్ అయితే కనీసం పట్టించుకోలేదని… ఇప్పుడు పుంగనూరులో అస్పియ మృతి దారుణం అన్నారు. ముడు రోజులైన పోలీసులు ఆ అమ్మాయి జాడ కనిపెట్టలేకపోయారు…. చివరకు మృతదేహం లభించిందని ఆగ్రహించారు. ప్రశాంతంగా ఉన్న పుంగనూరు లో ఇటువంటి ఘటన అందరినీ కలచివేసిందని తెలిపారు. మంత్రులు వారి బాధ్యతలు మరిచి ఇతర విషయాలు పై ఫొకస్ చేస్తున్నారని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించడం పని గా పెట్టుకుని మంత్రులు పని చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టీ, మంత్రులు వారి బాధ్యతలు నెరవేర్చాలని… వైఎస్ జగన్ ఈ నెల 9న అశ్వీయ తల్లిదండ్రులను కలిసి పరామర్శిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news