వైసీపీ ప్రభుత్వం పై ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు.

-

బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి – గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఆరోపణలు చేసిన ఇంచార్జ్ నేదురుమల్లి. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారు.

రాష్ట్ర పరిధిలో దాదాపు రూ. 400 కోట్ల రూపాయలు రోడ్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటువంటి ఆర్థిక దుస్థితి, దుర్గతి ప్రభుత్వం పెట్టుకుని ఇతరుల మీద నిందలు వేయడం తప్పు. రాష్ట్రంలో వారం.., పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎన్నికల్లో అన్నీ పార్టీలు రంగంలో ఉంటాయి. నేను కూడా ఏదో ఒక పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసి మీతో ఉంటాను. మీతో పాటూ ఈ ఎన్నికల్లో నేను పోరాటం చేస్తాను. పోరాట ఫలితం మీరిచ్చే తీర్పును బట్టి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మీ తీర్పులో, నన్ను ఆశీర్వదిస్తే మీకు ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ అవకాశం నాకు మళ్లీ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news