మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే భూమన

-

ఏపీలో కనుమరుగువుతున్న కళారూపాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్న మంత్రి రోజాకు అభినందనలు తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం జగన్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం గొప్ప విషయం అని కొనియాడారు. మంత్రి రోజా తప్ప ఇంకెవరూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మంత్రి రోజాకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు ఎమ్మెల్యే భూమన.

అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. తెలుగు అన్న పదానికి స్వస్తి చెబుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్ కూడు పెట్టదు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ తో పాటు, కళల్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. చదువు సంపద అని అంబేద్కర్ చెప్పారని..ఇదే అంశాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. చదువుతోనే ఉన్నత భవిష్యత్తు, గుర్తింపు లభిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news